మంచిర్యాల ఎస్టీపీపీకి రెండు జాతీయ అవార్డులు

 మంచిర్యాల ఎస్టీపీపీకి రెండు జాతీయ అవార్డులు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్(ఎస్టీపీపీ)​కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి.  ఎన్టీపీసీలో తీసుకున్న పర్యావరణహిత చర్యలకు గాను గౌరవం దక్కింది.  ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణ సంస్థ ఎన్విరో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలహాదారు వి.ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.చౌదరి.. ముంబైలో జరిగిన సంస్థ సమావేశంలో వెల్లడించారు.
సమర్థ నీటి వినియోగానికి గాను నేషనల్​ లెవల్ బెస్ట్​ ​ వాటర్​ మేనేజ్​​మెంట్​అవార్డు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్​ అవార్డు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని 500మెగావాట్లు అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న 75కు పైగా థర్మల్​ విద్యుత్​ కేంద్రాల పనితీరు అధారంగా అవార్డులకు ఎంపికచేశారు. అవార్డులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అందజేశారు. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్​ ఆనందం వ్యక్తంచేశారు. ప్లాంట్​ అధికారులను, ఉద్యోగులను అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఎస్టీపీపీ  ఉన్నతోద్యోగులు పాల్గొన్నారు.