
కోయంబత్తూర్: ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో తమిళనాడు కోయంబత్తూర్ లోని రెండు పోలీస్ స్టేషన్లను టెంపరరీగా మూసివేశారు. పోడానూర్, కునియముతూర్ ప్రాంతాలలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ల సిబ్బందిని స్థానిక ఫంక్షన్ హాల్లోకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన ఆరుగురు స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిపారు. మిగతా సిబ్బంది నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించగా 105 మందికి నెగిటివ్ వచ్చిందని పోలీస్ కమిషనర్ సుమిత్ శరన్ తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే 1,755 మందికి వైరస్ సోకగా.. 22 మంది చనిపోయారు.