
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ కు గణనాథులను తరలించేందుకు ఆర్టీఏ 2 వేల వాహనాలను సమకూర్చింది. పోలీస్ అధికారులు ఇచ్చిన రూట్మ్యాప్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో మండపాలకు అవసరమైన భారీ వాహనాలను అందుబాటులో ఉంచామని నోడల్ అధికారిగా ఉన్న ఆర్టీఏ జాయింట్ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్కుమార్ తెలిపారు.