న్యూఢిల్లీ: తిహాడ్ జైలు ఖైదీలకు ఇక నుంచి క్రీడల్లో శిక్షణ అందనుంది. ఆరు ఆటల్లో ప్రొఫెషనల్స్ తో ట్రెయినింగ్ ఇప్పించేందుకు ఢిల్లీ జైళ్ల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ తోనూ శిక్షణ ఇప్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిహాడ్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న సుశీల్ కుమార్.. ఇకపై ఖైదీలకు కుస్తీ పాఠాలు, ఫిట్ నెస్ క్లాసులు బోధించనున్నాడు. ఇప్పటికే ఆరు నుంచి ఏడుగురు ఖైదీలు అతడి వద్ద కోచింగ్ తీసుకుంటున్నారని ఢిల్లీ జైళ్ల శాఖ పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సీఎస్ఎఆర్ ప్రాజెక్టులో భాగంగా ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, చెస్, క్యారమ్స్ గేమ్స్ లో ట్రెయినింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. ఇకపోతే, సహచర రెజ్లర్ సాగర్ ధన్కర్ మృతికి కారణమైనట్లు ఆరోపణలు రుజువు కావడంతో సుశీల్ ను తిహాడ్ కు తరలించారు.
Delhi | We have allowed Sushil Kumar to give fitness and wrestling coaching to those prisoners who are interested, 6-7 prisoners are receiving coaching from him: DG (Prisons)
— ANI (@ANI) March 12, 2022
Wrestler Sushil Kumar is currently lodged in Tihar Jail in Sagar Dhankar murder case. pic.twitter.com/HZIoDCsGWe
మరిన్ని వార్తల కోసం: