న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళలను దుండగులు కాల్చిచంపారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడిని, అతడి అనుచరుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్బస్తీలో తన సిస్టర్లపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని బాధిత మహిళల సోదరుడు ఉదయం 4.40కు పోలీసులుకు ఫోన్చేసి తెలిపాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో మృతురాళ్లను పింకీ (30), జ్యోతి (29)గా గుర్తించామని డీసీపీ మీడియాకు తెలిపారు.