
అహ్మదాబాద్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో యు ముంబా జట్టు చాంపియన్గా నిలిచింది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబా 8–-4 తేడాతో జైపూర్ పేట్రియాట్స్ను ఓడించి మెగా లీగ్లో తొలి టైటిల్ సొంతం చేసుకుంది. తొలి పోరులో ముంబా ప్లేయర్ లిలియన్ బార్డెట్2–-1తో కనక్ ఝాపై నెగ్గి శుభారంభం ఇచ్చాడు. విమెన్స్ సింగిల్స్లో లీగ్ టాప్ ర్యాంకర్ బెర్నాడెట్ స్జోక్స్ 2–1తో ఇండియా టాప్ ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకులను ఓడించింది.
కీలకమైన మిక్స్డ్ డబుల్స్లో కాశ్ పాల్– స్జోక్స్ 3–-0తో పేట్రియాట్స్ ద్వయం జీత్ చంద్ర–బ్రిట్ ఇర్లాండ్ను ఓడించి ముంబా విజయం ఖాయం చేశారు. ఆఖరి పోరులో జీత్ చంద్ర 1-–2తో అభినంద్పై నెగ్గినా జైపూర్ రన్నరప్తో సరిపెట్టుకుంది.