ఇండియా నుంచి వస్తే  వీసాలియ్యం

ఇండియా నుంచి వస్తే  వీసాలియ్యం

దుబాయ్: గడిచిన 14 రోజుల్లో ఇండియాలో ఉండి వచ్చే లేదా ఇండియా మీదుగా ప్రయాణించేటోళ్లకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఏఈ తెలిపింది. ఈ విషయాన్ని ఎథిహాద్ ఎయిర్ వేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్రావెల్ గైడ్ లైన్స్ లోని రూల్స్  మేరకు ప్రయాణికులు నడుచుకోవాలని సూచించింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ట్వీట్ చేసింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ యూఏఈ తరచుగా ట్రావెల్ రెగ్యులేషన్స్​ను సవరిస్తోంది.