అదానీతో ఉబర్​ సీఈఓ భేటీ

అదానీతో ఉబర్​ సీఈఓ భేటీ

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రస్తుతం మనదేశ పర్యటనలో ఉన్న ఉబెర్ సీఓఈ దారా ఖోస్రోషాహితో సమావేశమయ్యారు. రెండు సంస్థల మధ్య భవిష్యత్తులో సహకారం ఉంటుందని ప్రకటించారు. భారత ఆర్థిక వృద్ధి తదితర అంశాల గురించి వీరిద్దరూ చర్చించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ వాడకాన్ని పెంచడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని దారా అన్నారు.

అదానీ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు కానీ సమావేశం ఎక్కడ జరిగిందో చెప్పలేదు. అహ్మదాబాద్‌‌లోని అదానీ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.   బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనితో "బిల్డింగ్ పాపులేషన్ స్కేల్ టెక్నాలజీ" గురించి కూడా దారా చర్చించారు.