సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి : ఉదయ్ కుమార్

సంగారెడ్డి  జిల్లాలో  మున్సిపల్ ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి : ఉదయ్ కుమార్

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్​ప్రావీణ్య వివరించారు. 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని, రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  అడిషనల్ కలెక్టర్ పాండు, నోడల్ అధికారులు జానకి రెడ్డి, వెంకటేశ్వర్లు, రామాచారి, అఖిలేశ్​రెడ్డి, అరుణ, తులచ్య నాయక్, జగదీశ్, కిరణ్ కుమార్, చలపతిరావు, బాల్ రాజ్, విజయలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.