కరోనాపై పోరాటం: రాబోయే రోజులే కీవలం: థాక్రే

కరోనాపై పోరాటం: రాబోయే రోజులే కీవలం: థాక్రే
  •  ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం
  • 31 వరకు ఫ్లైట్లు తెరిచే అవకాశం లేదు

ముంబై: కరోనాపై పోరాటం చేయడం ఇక నుంచి ఇంకా కష్టం అవుతుందని, కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. దాని కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితిపై ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన ఉద్ధవ్‌ థాక్రే ఈ విషయాలు చెప్పారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ నెల 31 వరకు ఫ్లైట్లను అనుమతించేది లేదని అన్నారు. లాక్‌డౌన్‌ వేళ ప్రజలు ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రజలకు థ్యాంక్స్‌ చెప్పారు. “ మే చివరినాటికి 14వేల మంచాలు రెడీ చేస్తాం. ఇప్పటికే 7వేలు రెడీగా ఉన్నాయి” అని సీఎం చెప్పారు. ఈ నెల 31తో లాక్‌డౌన్‌ ముగిసిపోతుందని చెప్పలేమని అన్నారు. అప్పటి పరిస్థితిని అంచనా వేసి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 47 వేలు దాటగా.. 13 వేల మంది వరకు రికవరీ అయ్యారు.