- రూపాలు మార్చారు... శాస్రోక్తంగా పూజల్లేవు
- లష్కర్ రంగంలో స్వర్ణలత ఆగ్రహం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు చేయడం లేదు. ప్రతీ ఏడాది మొక్కుబడిగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సంతోషం కోసం పూజలు అందుకుంటున్నా. కానీ ఇష్టపూర్వకంగా పూజలు అందుకోలేకపోతున్నా. ఈ విషయం ప్రతీ ఏడాది నా నోటితో చెప్పించాలనుకుంటున్నారు. పూజల విషయంలో సంతోషంగా లేనని చెప్పినా...మారడం లేదు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్నా. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా పూజలు సక్రమంగా చేయాలి.
మీ పూజల పట్ల నేను సంతోషంగా లేను. మీ కళ్లు తెరిపించాలనే వర్షాలు కురిపిస్తున్నా. గర్భాలయంలో మొక్కబడిగా పూజలు చేస్తున్నారని వానలు కురిపిస్తున్నా. కొండంత కాకుండా గోరంత ఆగ్రహం చూపిస్తున్నా. అది మీకోసమే. నా గురించి తెలియాలనే.
ప్రతీ ఏడాది ఇష్టానుసారంగా నా రూపాన్ని మారుస్తున్నారు. ఇంకా ఎన్నిరూపాలు మారుస్తారు? మీకు నచ్చినట్లు మారుస్తారా ? భక్తుల హృదయాల్లో నా రూపం స్థిరంగా ఉండాలనుకుంటున్నా. భక్తులు నా స్థిర రూపాన్ని కన్నులారా వీక్షించాలని నా కోరిక. నా రూపాన్ని స్థిరంగా నిలపాలి. మీరేంటి చేసేది.? నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లు నాదే మీరు కాజేస్తున్నారు. నా విగ్రహ ప్రతిష్ట కానివ్వండి..మీరు కోరుకున్నది జరిపిస్తా..చేస్తా.
స్త్రీలు, గర్భిణీలు, ప్రజలందరిని చల్లంగా చూస్తా. వారందరిని కడుపులో పెట్టుుకని కాపాడతా. భక్తులకు ఎలాంటి ఆపద లేకుండా చూస్తా. సంతోషంగా పూజలు అందుకుంటా. ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.