దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అల్ట్రా లగ్జరీ హోమ్స్ సేల్స్ మూడు రెట్లు ఎగసినట్లు ఎనరాక్ వెల్లడించింది. రూ. 40 కోట్ల విలువ మించిన ఇండ్లను అల్ట్రా లగ్జరీ హోమ్స్గా పరిగణిస్తారు. ఇలాంటి అల్ట్రా లగ్జరీ హోమ్స్ అమ్మకాలు ఈ ఏడాది రూ. 4,063 కోట్లకు చేరినట్లు ఎనరాక్ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై –ఎంఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె సిటీలలో కలిపి 58 అల్ట్రా లగ్జరీ హోమ్స్ అమ్ముడయినట్లు పేర్కొంది.
2022 కేలండర్ ఇయర్ మొత్తం మీద చూస్తే రూ. 1,170 కోట్ల విలువైన 13 అల్ట్రా లగ్జరీ హోమ్స్ మాత్రమే అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ ఎనరాక్ వివరించింది. కరోనా తర్వాత లగ్జరీ, అల్ట్రా లగ్జరీ హోమ్స్ సెగ్మెంట్స్లో అమ్మకాలు బాగా పుంజుకున్నట్లు ఎనరాక్ చైర్మన్ అనూజ్ పూరి చెప్పారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్, అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ ఇలాంటి ఇండ్లను కొనుగోలుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. జియో పొలిటికల్ టెన్షన్లు పెరుగుతాయనే అంచనాలతో హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్లో చాలా మంది స్టాక్మార్కెట్ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, ఆ డబ్బుతో ఇండ్లను కొంటున్నట్లు వివరించారు.
ఏడు సిటీలలో కలిపి 58 అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలు అమ్ముడైతే, ఇందులో ఒక్క ముంబై సిటీలోనే 63 ప్రాపర్టీలు ఉండటం విశేషం. ఢిల్లీ–ఎన్సీఆర్లో 4, హైదరాబాద్లోని జూబిలీహిల్స్లో రూ. 40 కోట్ల విలువైన ఒకే ఒక్క రెసిడెన్షియల్ డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. ముంబై సిటీలో జరిగిన డీల్స్లో మూడు డీల్స్ఒక్కొక్కటి రూ. 200 కోట్ల పైబడినవేనని, ఈ మూడు డీల్స్ను ఎనరాక్ కన్సల్టింగే నిర్వహించిందని పూరి వివరించారు.