బంగ్లాదేశ్ తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత పేసర్ మహమ్మద్ షమీ చేతికి గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు దూరం అయ్యాడు.ఈ సిరీస్కు ముందు ప్రాక్టీస్లో భాగంగా షమీ చేతికి గాయమైనట్లు బీసీసీఐ ఆధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అతనికి రెండు వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. బంగ్లాతో వన్డేలకు షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇక మహమ్మద్ షమీ టెస్టులకు కూడా ఆడేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా సిరీస్ కు దూరం కాగా తాజాగా షమీకి గాయం కావడం జట్టును కలవరపెడుతోంది. బంగ్లా పర్యటనలో భాగంగా ఆ జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి సిరీస్ స్టార్ట్ కానుంది.