న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న సీఎస్కే స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా తొలిసారి స్పందించాడు. పంజాబ్లో తమ బంధువుల (మేనత్త) ఫ్యామిలీకి చాలా ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీలైనంత త్వరగా తమ వారికి న్యాయం చేయాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేశాడు. జరిగిన దుర్ఘటనకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘పంజాబ్లో మా ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. దుండగులు జరిపిన దాడిలో మా అంకుల్, కజిన్ చనిపోయారు. మా మేనత్తకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఇంతటి ఘోరాన్ని మేం తట్టుకోలేకపోతున్నాం. దీనికి బాధ్యులెవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. మరిన్ని ఘోరాలు చేయకముందే నేరస్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. వీలైనంత త్వరగా పంజాబ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి మాకు న్యాయం చేయాలి’ అని రైనా వరుస ట్వీట్స్ చేశాడు. ఈ ట్వీట్లో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ను ట్యాగ్ చేశాడు. దీనిపై అమరిందర్ వెంటనే స్పందించారు. సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసినట్టు పంజాబ్ డీజీపీ ప్రకటించారు.