
అండర్ 19 విమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు మధ్య జరుగుతోన్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టుకు బౌలర్లు సత్తా చాటారు. పార్షవి చోప్రా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కివీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. కివీస్ ఓపెనర్లు అన్నా బ్రౌనింగ్ (1), ఎమ్మా మెక్లియోడ్ (2) అరంభంలోనే చేతులెత్తేశారు. జార్జియా ప్లిమ్మర్ (35), ఇసాబెల్లా గాజ్ (26) జట్టును ఆదుకోవడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. భారత్ బౌలర్లలో టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి చెరో వికెట్ తీశారు.