
తెలంగాణలో నిరుద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అవకతవకలకు, లీకేజీలకు సంబంధించి కమిషన్ బోర్డును ప్రక్షాళన చేయాలని ..ఆ తర్వాతే పరీక్షలు పెట్టాలని నినాదంతో నిరుద్యోగులంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పోస్టు కార్డులు రాస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను ఈ పోస్ట్ కార్డులో వివరిస్తూ పోస్ట్ కార్డు ఉద్యమన్ని చేపట్టారు. TSPSC రద్దు చేయాలంటూ రాష్ట్రపతి, గవర్నర్ కు నిరుద్యోగుల పోస్ట్ కార్డుల్లో రాశారు.