కొమురం భీం ఆదివాసీలకు ఆదర్శం : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కొమురం భీం ఆదివాసీలకు ఆదర్శం :  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు కొమురం భీం ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండలం కేశవాపురంలో మంగళవారం ఆయన కొమురం భీమ్​ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 

గిరిజనుల వీరుడు కొమురం భీమ్​ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకుముందు ఆయనకు ఆదివాసీలు రేలా నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.