సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : యూబీఐ మేనేజర్ మినాతి భోయ్

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : యూబీఐ మేనేజర్ మినాతి భోయ్
  • యూబీఐ మేనేజర్ మినాతి భోయ్ 
  • బ్యాంక్ 107వ ఫౌండేషన్ డే 

ముషీరాబాద్, వెలుగు: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మినాతి భోయ్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు  అనధికారికంగా వచ్చే ఎటువంటి మెస్సేజ్​లకు స్పందించద్దని సూచించారు. మంగళవారం రాంనగర్ బ్రాంచిలో బ్యాంక్​107వ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్​బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు.

అనంతరం మాట్లాడుతూ..  యూనియన్ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ముందుంటామని తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు కోటేశ్వర్ రావు, గురుశంకర్, గంగారత్నం, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కల్యాణ మండపంలో..

హైదరాబాద్​సిటీ: దేశవ్యాప్తంగా అన్ని జోనల్​కార్యాలయాల్లో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 107వ ఫౌండేషన్​డే నిర్వహించినట్లు బ్యాంక్​ తెలంగాణ ఎండీ, చీఫ్​ఎగ్జిక్యూటివ్​ఆఫీసర్ ఆశిష్​పాండే తెలిపారు. మంచిర్యాలతో కలిపి  మరో 5 కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల బ్రాంచిని డీఎఫ్ఎస్ సెక్రటరీ ఎం.నాగరాజు వర్చువల్​గా ప్రారంభించారన్నారు. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాబార్డ్​చీఫ్ జనరల్​ మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఆంధ్రాబ్యాంక్​మాజీ ఎండీ.నారాయణన్​ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాంక్​స్టాఫ్​తోపాటు కస్టమర్లు పాల్గొన్నారు.