న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయబోయే నిధులను కేంద్ర ప్రభుత్వం కొంత పెంచింది. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు 25 వేల 172 కోట్ల రూపాయలు కేటాయించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 24 వేల 435 కోట్ల రూపాయల కంటే ఇది 3 శాతం ఎక్కువ. ‘నారీ శక్తి’ ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధి చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు.
ఏ కార్యక్రమానికి ఎంతంటే..
మహిళల, పిల్లల సమగ్ర ప్రయోజనాల కోసం కేంద్ర సర్కార్ ఇటీవల మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షమ్అంగన్వాడీ, పోషన్2 కార్యక్రమాలను ప్రారంభించింది. తాజా బడ్జెట్లో సక్షమ్ అంగన్వాడీ, పోషన్ 2 కోసం 20 వేల 263 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది గతంలో ఖర్చు చేసిన 20వేల 105 కోట్ల రూపాయల కంటే రూ.158 కోట్లు ఎక్కువ. మహిళల భద్రత, సాధికారత టార్గెట్గా ప్రవేశపెట్టిన మిషన్ శక్తి ప్రోగ్రామ్ కోసం రూ.3వేల 184 కోట్లు కేటాయించారు. ఇది 2021–22లో ఖర్చు చేసిన దానికంటే రూ.75 కోట్లు ఎక్కువ. పిల్లల రక్షణ, సంక్షేమం కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య కోసం రూ.1,472 కోట్లు అలకేట్ చేశారు. ఈ కార్యక్రమం కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఈ బడ్జెట్లో ఏకంగా రూ.572 కోట్లు పెంచారు.
బ్యూరోక్రాట్ల ట్రైనింగ్కు రూ.288 కోట్లు
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో బ్యూరోక్రాట్లకు శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కు పర్సనల్మినిస్ట్రీకి ఈ బడ్జెట్లో రూ.288 కోట్లకు పైగా కేటాయించారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పెన్షనర్స్ స్కీమ్స్ కింద మరో రూ. 44.25 కోట్లు అలొకేట్ చేశారు. రూ. 288.14 కోట్ల మొత్తం కేటాయింపుల్లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ను (ఎల్బిఎస్ఎన్ఎఎ)ను అప్గ్రేడ్ చేయనున్నారు. ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్మేనేజ్మెంట్లోనూ సౌలతులు పెంచనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఖర్చుల కోసం రూ.77.39 కోట్లు కేటాయించారు. దీని అటానమస్ బాడీస్ అయిన గృహ కల్యాణ్ కేంద్రం, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డ్, నేషనల్ రిక్రూటింగ్ఏజెన్సీ(ఎన్ఆర్ఏ)కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం అందించేందుకు మరో రూ. 399.20 కోట్లు ఇచ్చారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ట్రిబ్యునల్కు రూ.159 కోట్లు, స్టాఫ్సెలక్షన్కమిషన్(ఎస్ఎస్సీ)కు రూ. 263 కోట్లు కేటాయించారు.