ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని సూచన
సిమ్లా: సిటిజన్షిప్ సవరణ చట్టంపై ప్రజల్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. ఈ చట్టంలో సిటిజన్షిప్ను తొలగించే రూల్ లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ముస్లింలు తమ సిటిజన్షిప్ను కోల్పోతారని పుకార్లు వ్యాప్తి చేస్తూ లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. హిమాచల్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా శుక్రవారం సిమ్లాలో జరిగిన సభలో పాల్గొన్న అమిత్షా కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. సీఏఏలో సిటిజన్షిప్రద్దుకు సంబంధించిన ఒక్క లైన్ అయినా ఉన్నట్లు చూపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సవాల్ చేశారు. ఈ చట్టం ద్వారా ఎవరి సిటిజన్షిప్ పోదని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, విభజించవద్దు’’ అని అమిత్షా కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న సీఏఏను మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు పరిశీలించాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లలో మతపరమైన హింసను ఎదుర్కొన్న మైనార్టీలకు సీఏఏ సిటిజన్షిప్ కల్పిస్తుందని చెప్పారు. మైనారిటీల రిలీజియస్, ఇతర హక్కుల పరిరక్షణకు నెహ్రూ– లియాఖత్ ఒప్పందాన్ని అమలు చేయడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయిందని, అదే సీఏఏ చట్టాన్ని రూపొందించేందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రేరేపించిందని అమిత్షా అన్నారు.
రాహుల్.. లయర్ ఆఫ్ ది ఇయర్
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం రాహుల్కు అలవాటైంది. ప్రెసిడెంట్ పోస్టు పోయినా.. ఆ అలవాటు మాత్రం పోలేదు. ఆయన చేసే కామెంట్లు గతంలో ఆయన కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది పెడుతుండేవి. ఇప్పుడైతే ఏకంగా దేశాన్ని కూడా కలవరపెడుతున్నాయి. లయర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ గనక ఉంటే.. ఆ అవార్డు అందుకునే అర్హత రాహుల్కు మాత్రమే ఉంది.- కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్