అసోం పోలీసులను చూసి స్మగ్లర్లు భయపడుతున్నారు

అసోం పోలీసులను చూసి స్మగ్లర్లు భయపడుతున్నారు

అసోం పోలీసులను చూసి స్మగ్లర్లు భయపడుతున్నారని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌహతిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అసోంలో స్మగ్లింగ్ ను తమ ప్రభుత్వం కట్టడి చేసిందని చెప్పారు. అసోం మీదుగా బంగ్లాదేశ్కు ఒక్క ఆవును వెళ్లనివ్వమని గతంలోనే హామీ ఇచ్చామన్నారు. అసోంలో శాంతియుత వాతావరణానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు

ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్