పోలీస్ మెమోరియల్‌ను సందర్శించిన హోంమంత్రి అమిత్‌షా

పోలీస్ మెమోరియల్‌ను సందర్శించిన హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేషనల్ పోలీస్ మెమోరియల్ ను సందర్శించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. నిన్న హోంశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమంగా.. ఇవాళ పోలీస్ మెమోరియల్ కు వచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నేషనల్ పోలీస్ మ్యూజియానికి వెళ్లారు. అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు అమిత్ షా. 34 వేల మందికి పైగా పోలీసులు, భద్రతా దళాలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని ట్వీట్ చేశారు అమిత్ షా.

మరిన్ని వార్తలు