అక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా... సూర్యాపేటలో సభ

 అక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా... సూర్యాపేటలో సభ

తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 27వ తేదీన   కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. సూర్యాపేట ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అమిత్ షా సభ ఏర్పాట్ల కోసం సూర్యాపేటకు వెళ్తున్నారు బీజేపీ నేతలు.  ఈ నెల31న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్   తెలంగాణకు రానున్నారని తెలుస్తోంది. 28,29 తేదీల్లో అస్సోం సీఎం కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారని సమాచారం.  

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక  అమిత్ షా రాష్ట్రానికి రావడం ఇది రెండో సారి.  అంతకుముందు రాష్ట్రానికి వచ్చిన  ఆయన అదిలాబాద్ లో పర్యటించారు.   తెలంగాణలో 2023 నవంబర్‌ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ..ఇప్పుడు సెకండ్‌ లిస్టు రిలీజ్‌పై దృష్టిపెట్టింది. మరో రెండు మూడు రోజుల్లో సెకండ్ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ALSO READ :- ODI World Cup 2023: ఐదింట మూడు ఓటములు.. పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశమెంత?