లోకల్​ ట్రైన్ లో ప్రయాణించిన కేంద్ర మంత్రి 

లోకల్​ ట్రైన్ లో ప్రయాణించిన కేంద్ర మంత్రి 

థానే, దివా స్టేషన్ల మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ల పరిశీలన

ముంబై: శుక్రవారం ముంబైకి వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోకల్​ ట్రైన్ లో​ ప్రయాణించారు. థానే,  దివా స్టేషన్లను కలుపుతూ కొత్తగా నిర్మించిన రెండు రైల్వే లైన్లను పరిశీలించడం కోసం మంత్రి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తన పర్యటన సందర్భంగా మంత్రి రోడ్డు పక్కన ఉన్న టిఫిన్​ సెంటర్​ లో 'వడ పావ్' తిన్నారు. మధ్యాహ్నం 1గంటకు థానే స్టేషన్ కు చేరుకున్న మంత్రి ... థానే నుంచి దివా వెళ్తున్న లోకల్​ ట్రైన్​సెకండ్​ క్లాస్​ కంపార్ట్ మెంట్​ లో ప్రయాణించారు. ఈ  సందర్భంగా ట్రైన్​లోని ప్రయాణికులతో మంత్రి ముచ్చటించారు. రైల్వే శాఖ అందిస్తున్న సౌకర్యాల గురించి, వాటి నాణ్యత గురించి మంత్రి వారినడిగి తెలుసుకున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే థానేకి వస్తారని, కొత్తగా నిర్మించిన రెండు రైల్వే లైన్లతో పాటు..రెండు కొత్త రైళ్లను కూడా ప్రారంభించి .. జాతికి అంకితమిస్తారని మంత్రి తెలిపారు.  కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాన్వే, రైల్వే బోర్డు చైర్మన్ వీకే త్రిపాఠి, ఇతర అధికారులు  మంత్రి వైష్ణవ్ వెంట ఉన్నారు.

మరికొన్ని వార్తల కోసం:

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

మౌనమే ప్రేమ భాష.. మాటలు రాకున్నా ఇన్స్టా ఒక్కటి చేసింది