కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు

సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని..వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి...బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నారు.టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు అన్నారు. సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అని ప్రశ్నించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం... నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కేసీఆర్ చెప్పే గుణత్మాకమైన మార్పు అని ధ్వజమొత్తారు.కేసీఆర్ మాదిరిగా బీజేపీది కుటుంబ పార్టీ కాదన్నారు. దేశంలో కూడా కల్వకుంట్ల కుటుంబ పెత్తనం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని..అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. బంగారు తెలంగాణ  కాలేదు కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రం  బంగారు కుటుంబం అయిందన్నారు. వరి ధాన్యం కొనేది కేంద్రం మాత్రమేనని రైతులకు అర్థమైందన్నారు. పొదుపు సంఘాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. బీజేపీపై కక్ష కట్టిన కుటుంబ పార్టీలకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు కిషన్ రెడ్డి. 

అన్ని వార్తల కోసం

 

డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు: ఉక్రెయిన్ రిక్వెస్ట్

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు