బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి

బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింస జరుగుతూనే ఉంది. బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. 

ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మంత్రి మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దాడి జరిగిన వెంటనే పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఆయన వెనక్కి వెళ్లిపోయారు.