దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నం

దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నం

న్యూఢిల్లీ: దేశ చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత చరిత్రను భావితరాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పర్యాటక ప్రదేశాల దగ్గర జనం గుమికూడొద్దని కోరిన కిషన్ రెడ్డి.. కరోనా నియమాలను పాటించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించొచ్చన్నారు. ఢిల్లీలోని జాతీయ పురావస్తు కేంద్రాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ చరిత్ర అంతా ఢిల్లీ పురావస్తు శాఖ కేంద్రంలో రికార్డు చేయబడ్డాయని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు, భారత రాజ్యాంగ సంతకాల ప్రతులున్నాయని పేర్కొన్నారు. 18 కోట్ల పేజీలు, 55 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యాయాలు, లక్షా రెండు వేల మ్యాపులు ఉన్నాయని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో కొత్త నిర్మాణాలు వచ్చినా.. చారిత్రక సంపదను కాపాడుకుందామని స్పష్టం చేశారు.