యువత లీడర్లుగా ఎదగాలె : కిషన్ రెడ్డి

యువత లీడర్లుగా ఎదగాలె : కిషన్ రెడ్డి

ఓయూ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

ఓయూ, వెలుగు : యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్​రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్రే కీలకమన్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్​క్లూజివ్ గవర్నెన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘సోషియో పొలిటికల్ లీడర్​షిప్ స్కిల్స్’ అంశంపై మంగళవారం ఓయూలో ప్రారంభమైన 5 రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 1970లలో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేది కాదని, ఇప్పుడు మనకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.

దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. లీడర్​షిప్ స్కిల్స్ పై శిక్షణ పొందడం ఒక మంచి అవకాశమని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది గొప్ప నాయకులను, ఉద్యమకారులను ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ట్రెయినింగ్ ద్వారా లీడర్​షిప్ స్కిల్స్ పెంచుకుని యువత దేశ సేవకు ముందుకు రావాలని సూచించారు. దేశం కోసం ప్రధాని మోడీ ఎంతో కష్టపడుతున్నారని, యువత కూడా ఆయన కృషిలో భాగస్వాములు కావాలని కోరారు.