- సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నేతలు
- కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట యూనియన్ల నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని జాతీయ కార్మిక సంఘాల రాష్ట్ర లీడర్ల విమర్శించారు. లేబర్ కోడ్లపై కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో జాతీయ కార్మిక సంఘాల నేతలతో ఆదివారం నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం హెడ్డాఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ సంఘాల రాష్ట్ర నేతల మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు కలిగేలా చట్టాలను తీసుకువస్తోందని ఆరోపించారు. సింగరేణిని ప్రయివేటీకరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతొందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రోగ్రాంలో ఆయా యూనియన్ల స్టేట్ లీడర్లు మందా నర్సింహరావు, వంగా వెంకట్, త్యాగరాజన్, రమణమూర్తి, రాము, కృష్ణయ్య, ఆల్బర్ట్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
