
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 297 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై పలువురు సినీ స్టార్స్ స్పందిస్తూ తమ సానుభూతి తెలుపుతున్నారు.
లేటెస్ట్గా విమాన ప్రమాదంపై మలయాళ హీరో ఉన్ని ముకుందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. విమానం కూలిపోయిన ప్రాంతానికి సమీపంలోనే తాను పెరిగానని వెల్లడించారు. తన జీవితంలో 24 సంవత్సరాలు అహ్మదాబాద్లో గడిపానని, ప్రమాద స్థలానికి కొద్ది దూరంలోనే తమ కుటుంబం ఒకప్పుడు ఉండేదని ఆయన తెలిపారు. ఆ సంఘటన గురించి తెలుసుకుని తాను షాక్కు గురయ్యానని ఆయన పంచుకున్నారు.
"అహ్మదాబాద్లోని మణినగర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్లో విమాన ప్రమాదం జరిగిందని నాకు తెలిసింది. నేను 24 సంవత్సరాలుగా మణినగర్లో నివసించాను. కేరళ లాగే, గుజరాత్ నాకు అత్యంత ఇష్టమైన రాష్ట్రం. నా బాల్యం మరియు కౌమారదశ అక్కడే గడిపాను. ఈ వార్త నా హృదయంలో తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. నా పాఠశాల స్నేహితులు మరియు నేను షాక్లో ఉన్నాము. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయం విలపిస్తోంది. వారి దుఃఖాన్ని నేను ఊహించగలను. ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. కోల్పోయిన ప్రతి ఆత్మ వారి శాంతిని పొందాలి " అని ముకుందన్ తెలిపారు.
►ALSO READ | Sunjay Kapur: విమాన ప్రమాదంపై స్పందించిన గంటల్లోనే.. ఓ తేనెటీగ వల్ల సంజయ్ కపూర్ మృతి!
ఉన్నిముకుందన్ తన బాల్యం నుండి 24 సంవత్సరాల వయస్సు వరకు, తాను అహ్మదాబాద్లోని మణినగర్లో తన జీవితాన్ని గడిపానని ముకుందన్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇది 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.
Praying for the safety of all passenger And Crew 🙏🏻#plaincrash pic.twitter.com/l9txOTMAqr pic.twitter.com/fGlUDFwZxa
— Dipesh (@V_JaaaaaaaaN45) June 12, 2025
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (JUNE12న) మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ తీసుకుని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఇందులోని విమాన సిబ్బందితో సహా కనీసం 241 మంది మరణించారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులోని 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారని ఎయిరిండియా తెలిపింది. చనిపోయిన ప్రయాణీకుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం కూడా ప్రకటించింది.
🚨 BREAKING: A tragic plane crash has occurred in #Ahmedabad‘s Meghani Nagar area. Reports suggest around 200 people have lost their lives. Emergency services are at the site. More details awaited. #PlainCrash #AirIndia
— Sarcasm (@sarcastic_us) June 12, 2025
pic.twitter.com/llo58q6Vue
గతేడాది.. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి మలయాళ ప్రముఖ డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ క్యూబ్స్ షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. మార్కో సినిమా రూ.30కోట్ల బడ్జెట్ తో నిర్మించగా దాదాపుగా రూ.100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో రిలీజై కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.