అకాల వర్షం.. తడిసిన వడ్లు

అకాల వర్షం.. తడిసిన వడ్లు

కామారెడ్డి జిల్లాలో ఆయా చోట్ల శనివారం  ఉదయం అకాల వర్షం కురిసింది.  ఓ మోస్తరుగా వర్షం కురియడంతో వడ్లు తడిసిపోయాయి.  నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో  3 సార్లు ఆకాల వర్షం కురియగా..  12 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి.   వరి పైరు కోసి సెంటర్ల వద్ద , రోడ్డు పక్కన ఆరబోశారు. అకాల వర్షం కురియటంతో వడ్లు తడిచాయి.  ఎల్లారెడ్డి, లింగంపేట, బీర్కూర్​, బాన్సువాడ

 పిట్లం, భిక్కనూరు మండలాల్లో వడ్ల కుప్పలు నీట మునిగాయి.  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ ఏరియాలో ఉదయం నుంచి ముసురు వాన తో  వడ్లు తడిశాయి. - కామారెడ్డి, ఆర్మూర్ వెలుగు