మ‌రో ప్రేమ క‌థ.. ఇండియా వ‌చ్చిన బంగ్లాదేశ్ మ‌హిళ సానియా

మ‌రో ప్రేమ క‌థ.. ఇండియా వ‌చ్చిన బంగ్లాదేశ్ మ‌హిళ సానియా

నోయిడాలో నివసిస్తున్న ఓ భారతీయుడు మూడేళ్ల క్రితం తనను వివాహం చేసుకున్నాడని, వారికి ఒక పాప కూడా ఉందని బంగ్లాదేశ్ మహిళ ఆరోపించింది. అంతే కాదు ఆ మహిళ తన భర్తను వెనక్కి తీసుకెళ్లేందుకు వీసాపై భారత్‌కు చేరుకుంది. సానియా అక్తర్ అనే మహిళ.. సౌరభ్ కాంత్ తివారీ అనే వ్యక్తి తనతో తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఈ విషయంలో ఆమె పోలీసులను కూడా ఆశ్రయించింది.

మహిళ తన పూర్తి కథను పోలీసులకు వివరించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో నివసిస్తున్న సౌరభ్ కాంత్ తివారీ అనే వ్యక్తి కోర్ట్‌షిప్ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపింది. సౌరభ్ తనను ముస్లిం వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్నాడని కూడా ఆ మహిళ చెప్పింది. వారిద్దరికీ ఓ పాప కూడా ఉందని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఈ వీడియోలో ఆమె తన బిడ్డతో భారతదేశానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

Also Read :- దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

తాను గర్భవతిగా ఉన్న సమయంలో, ఆ వ్యక్తి త్వరలో తిరిగి వస్తానని చెప్పి వెళ్లాడని.. ఎన్ని రోజులకూ అతడు తిరిగి రాలేదని ఆమె తెలిపింది. సౌరభ్ ఢాకాలోని కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నాడని సానియా తెలిపింది. ఈ క్రమంలో సౌరభ్ వివరాలు తెలుసుకున్న ఆ మహిళ నోయిడాకు చేరుకుంది. దీంతో సెక్టార్ 62 పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను నిర్బంధ కేంద్రంలో ఉంచారు.