వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య

వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య

యూపీ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేసింది. భర్త నిద్రిస్తుండగా ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఈ ఘటన సహరన్‌పూర్‌ జిల్లా హౌజ్‌ఖేరి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని 32 ఏండ్ల రిషిపాల్‌గా గుర్తించారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషిపాల్‌కు పదేండ్ల కిందట పూనమ్‌తో వివాహమైంది. ఆ తర్వాత పూనమ్‌కు పొరుగున ఉండే అంకుర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఈ విష‌యం రిషిపాల్ కు తెలియ‌డంతో భార్య‌ను  పలుమార్లు హెచ్చ‌రించాడు.

దీంతో కోపం పెంచుకున్న పూన‌మ్.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను ఎలాగైనా అడ్డుతొల‌గించుకోవాల‌ని ప్లాన్ వేసింది. రాత్రి వేళ భర్త నిద్ర‌పోతున్న స‌మ‌యం చూసి, ప్రియుడు అంకుర్‌ని పిలిచి ఇద్దరూ క‌లిసి అత‌ని గొంతు కోసి చంపారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పడవేసేందుకు ప్రయత్నిస్తున్న పూనమ్‌ రిషీపాల్‌ సోదరుడి కంటపడటంతో ఈ ఘటన బ‌య‌ట‌ప‌డింది. రిషీపాల్‌ను హత్య చేసిన ఘటనలో నిందితులు అంకుర్‌, పూనమ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.