మేలో రూ.25.14 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు

మేలో రూ.25.14 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) ద్వారా రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.25.14 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి.  అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది.  గత ఏడాది మేలో జరిగిన రూ. 20.44 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ.  

 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఐ) డేటా ప్రకారం,  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూ రూ.23.94 లక్షల కోట్లుగా ఉంది. వాల్యూమ్ పరంగా చూస్తే, మేలో 1,867.7 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇవి 1,789.3 కోట్లుగా ఉన్నాయి.   ఈ ఏడాది మేలో రోజుకి సగటున రూ.81,106 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయి.