హైదరాబాద్లో డిజిటల్ పేమెంట్స్ హవా.. వార్షికంగా 33 శాతం అప్

హైదరాబాద్లో డిజిటల్ పేమెంట్స్ హవా.. వార్షికంగా 33 శాతం అప్

హైదరాబాద్​, వెలుగు: స్మార్ట్​ఫోన్లు, ఇంటర్నెట్​వాడకం విపరీతంగా పెరగడంతో తెలంగాణలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయని 'హౌ అర్బన్ ఇండియా పేస్ 2025' రిపోర్ట్ ​వెల్లడించింది. అమెజాన్​పే– కెర్నీ కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయి.  దీని ప్రకారం,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. యూపీఐ, క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ పేమెంట్స్ ​వాడకంలో ఇతర మెట్రో నగరాలతో సమానంగా ఉంది. దక్షిణాదిలోని పెద్ద, మధ్య తరహా నగరాల్లో ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లావాదేవీల్లో 35 శాతం, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 52 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. 

హైదరాబాద్​నుంచి డిజిటల్ చెల్లింపులు వార్షికంగా 33 శాతం పెరిగాయని అమెజాన్ పే ఇండియా సీఈఓ వికాస్ బన్సాల్ తెలిపారు. అమెజాన్ పే వాడకం టైర్ 2, టైర్ 3 నగరాల్లో 70 శాతం వృద్ధికి దోహదపడుతోందని చెప్పారు.  నగర కస్టమర్లు అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లకు వాలెట్స్,  క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారని వివరించారు.