హైదరాబాద్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కస్టమర్లు పీఎన్బీ డిజిటల్ రూపీ యాప్ను వాడుకొని యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. మర్చంట్ల దగ్గర డిజిటల్ రూపాయి (సీబీడీసీ) వాలెట్లు లేకపోయినా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తమ సీబీడీసీ వాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్లు జరపొచ్చు. డిజిటల్ రూపాయి మొబైల్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది.
పీఎన్బీ డిజిటల్ రూపి రిజిస్ట్రేషన్ ఇలా..
1. పీఎన్బీ డిజిటల్ రూపి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
2. పీఎన్బీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ సిమ్ కార్డును సెలెక్ట్ చేసుకోవాలి.
3. యాప్ పిన్ను సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాలెట్ను ఎంచుకొని, పీఎన్బీ అకౌంట్తో లింక్ చేసుకోవాలి.
4. డెబిట్ కార్డు డిటైల్స్ను ఎంటర్ చేయడం ద్వారా మొత్తం ప్రాసెస్ పూర్తవుతుంది. తర్వాత పీఎన్బీ డిజిటల్ రూపి యాప్ను వాడుకోవచ్చు.