
హైదరాబాద్, వెలుగు: యురేనియం తవ్వకాలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడాన్ని ప్రజాఉద్యమ విజయంగా భావిస్తున్నామని నల్లమల పరిరక్షణ కమిటీ బాధ్యుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు చెప్పారు. ఈ నేపథ్యంలో నల్లమలలోని అమ్రాబాద్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు పునరంకిత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్లమలలో దీపాలు వెలిగించి, యరేనియం చీకటిని తరిమేద్దామని ఆయన పిలుపునిచ్చారు.