
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. నైరుతు రుతుపవనాలు రోహిణీ కార్తెలోనే రావడంతో కొన్ని రోజులు వర్షాలు కురిశాయి. ఆ తర్వాత రుతుపవనాల కదలిక ఈశాన్య రాష్ట్రాల వైపు ఉండటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఓ రెండు మూడు రోజులుగా ఎండకాలం లాంటి వాతావరణం కనిపించింది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదిలిక తెలంగాణ రాష్ట్రంలో మందగించింది. దీంతో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయి. దీంతో ఇవాళ్టి (జూన్2) నుంచి మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షానికి ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ కేంద్ర నిపుణులు.
అదే విధంగా ఎండలు కాస్త పెరగనుండటంతో , గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం మేఘావృతమైన వాతావరణం.. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాతావరణంచల్లబడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు.
►ALSO READ | ఉక్రెయిన్ మైండ్ బ్లోయింగ్ అటాక్:4వేల కిలోమీటర్ల లోపలికి వెళ్లి..రిమోట్ డ్రోన్లతో రష్యాపై మెరుపుదాడి
అలాగే ఈరోజు, రేపు (జూన్ 2, 3వ తేదీలలో) కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వారం రోజుల తర్వాత యధావిధిగా మళ్ళీ వర్షాలు ఊపందుకుంటాయని చెప్పారు.