Rishab Pant:పంత్ ఉన్న హాస్పిటల్ లో ఊర్వశి రౌతేలా

Rishab Pant:పంత్ ఉన్న హాస్పిటల్ లో  ఊర్వశి రౌతేలా

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్ద స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ని డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్ లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ముంబైలోని అంబానీ హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిందే. పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్త వినగానే ఊర్వశి.. ‘ప్రార్థిస్తున్నాను’ అని తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. అది చూసిన ఫ్యాన్స్ అంతా ఆ పోస్ట్ పంత్ కోసమే పెట్టిందనుకున్నారు. ఇప్పుడు పంత్ ముంబై హాస్పిటల్ లో చేరిన కొన్ని గంటల్లోనే ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో హాస్పిటల్ ఫొటో పెట్టింది. దీంతో వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఊర్వశి.. పంత్ కోసమే హాస్పిటల్ కి వెళ్లిందా? లేక వేరే విషయంపై ఆ ఫొటో షేర్ చేసిందా? అన్న విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

అయితే పంత్, ఊర్శశి 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. చాలా సార్లు ఈ ఇద్దరు కలిసి తిరిగిన ఫొటోలతో ఈ పుకార్లు నిజం అని అనుకున్నారు. కానీ, 2019 ఈ వార్తని పంత్ తీవ్రంగా ఖండించాడు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఇషా నేగితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరి ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పంత్ స్పంష్ట చేసినా ఊర్వశి, పంత్ ల రిలేషన్ షిప్ గురించి పుకార్లు మాత్రం ఆగటం లేదు. దీనికి తోడు ఊర్శశి పెడుతున్న పోస్ట్ లతో వీళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని అనుకుంటున్నారంతా.