జియోలో ఇన్వెస్ట్ మెంట్ కు సిద్ధమైన మరో కంపెనీ

జియోలో ఇన్వెస్ట్ మెంట్ కు  సిద్ధమైన మరో కంపెనీ

న్యూఢిల్లీ: అమెరికా బేస్డ్ గా కార్యకలాపాలు నడిపించే విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్ (విస్టా) అనే సంస్థ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. విస్టా రూ.11,376 కోట్లతో జియోలో 2.32% స్టాక్ కొనుగోలుకు రెడీ అయింది. రీసెంట్ టైమ్ లో జియోలో ఇది మూడో అతి పెద్ద ప్రొఫైల్ ఇన్వెస్ట్ మెంట్ కానుంది. గత మూడు వారాల్లో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు జియోలో రూ.60,596 కోట్లను ఇన్వెస్ట్ చేశాయని రిలయన్స్ ఇండస్ట్రీ తెలిపింది.

‘దేశ ప్రజల ప్రయోజనం కోసం ఇతర పార్ట్ నర్స్ లాగే ఇండియన్ డిజిట్ ఎకో సిస్టమ్ ను మార్చడానికి విస్టా కూడా సంసిద్ధంగా ఉంది. మంచి భవిష్యత్ కోసం ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్ ఆఫ్ టెక్నాలజీ అవసరమని విస్టా నమ్ముతోంది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేశ్ అంబానీ చెప్పారు. గత నెల 22వ తేదీన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రూ.43,574 కోట్లు జియోలో ఇన్వెస్ట్ చేసింది. దీని ద్వారా 9.99 శాతం జియో ప్లాట్ ఫామ్స్ లోని వాటాను ఎఫ్ బీ దక్కించుకుంది. ఈ నెల 4వ తేదీన సిల్వర్ లేక్ అనే మరో యూఎస్ బేస్ట్ సంస్థ జియోలో రూ.5,656 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో జియో విలువ రూ.4.09 లక్షల కోట్లకు చేరింది.