
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ సప్లయ్ చెయిన్, ఇన్నోవేషన్లలో పార్ట్నర్షిప్ కోసం ఇండియా, అమెరికాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. కేంద్ర కామర్స్, ఇండస్ట్రీస్ శాఖల మంత్రి పీయుష్గోయల్ఆహ్వానం మేరకు అమెరికా కామర్స్మంత్రి జినా రైమండో ఈ నెల 7–10 తేదీల్లో ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు అవకాశాల గురించి చర్చ జరిగింది. ఇండియా– యూఎస్ కమర్షియల్ డైలాగ్లో భాగంగా ఈ ఎంఓయూపై సంతకాలు జరిగాయి. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ సమస్యలను పరిష్కరించడానికి సాయం చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇరు దేశాలకు ఉపయోగపడేలా ఆర్ అండ్ డీ, ట్యాలెంట్, స్కిల్ డెవెలప్మెంట్పై ఫోకస్ చేస్తారు.