
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగిసింది. ట్రంప్ దంపతులతో పాటు వారి కూతురు ఇవాంకా దంపతులు కూడా తాజ్మహల్ను సందర్శించారు.భర్త కుష్నర్తో కలిసి ఇవాంక తాజ్మహల్ వద్ద ఫొటోలు దిగారు. తాజ్మహల్ అందాలను ఆస్వాదించారు. ఆ తర్వాత నుంచి వారు ఆగ్రా నుంచి ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం వద్ద ట్రంప్ దంపతులకు యూపీ గవర్నర్, సీఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి వీడ్కోలు పలికారు.
ట్రంప్ బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ రాత్రి ఢిల్లీలోని హోటల్ ITC మౌర్యలో ట్రంప్ కుటుంబం బస చేయనుంది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు అధికారక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటి, ఆ తర్వాత రాజ్ ఘాట్ లో గాంధీ మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నాం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు ట్రంప్. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.