
ఇరాక్లో రాకెట్ల మోత మోగింది. బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన రాకెట్ లాంఛర్ల దాడిలో ఇరాన్, ఇరాక్ టాప్ కమాండర్లు చనిపోయారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ చీఫ్ మేజర్ జనరల్ ఖాసిం సొలెమన్ మరియు పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ డిప్యూటీ కమాండర్ అబూ మహదీ అల్ ముహందిస్ హతమయ్యారు. ఈ దాడిలో మొత్తం 8 మంది హతమయ్యారు. ఇరాక్కు చెందిన PMF తిరుగుబాటు సంస్థకు ఇరాన్ బహిరంగ మద్దతు ఇస్తుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఇరాన్, ఇరాక్ సీనియర్ కమాండర్లు చనిపోయినట్లు పాపులర్ మొబైలిజేషన్ ఫోర్స్ కూడా నిర్ధారించింది. ఈ దాడి అమెరికానే చేసిందని హషెద్ మిలటరీ ఫోర్స్ అంటోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్లో అమెరికా జాతీయ జెండాను ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకే దాడి జరిగినట్లు పెంటగాన్ కన్ఫమ్ చేసింది. ఈ కమాండర్లు బాగ్దాద్ ఎయిర్ పోర్ట్కు వస్తున్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో అమెరికా రాకెట్ లాంఛర్లతో దాడి జరిపింది. అమెరికా దౌత్యవేత్తలపై దాడులు చేసేందుకు సొలెమన్ వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు గుర్తించామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ దాడితో ఇరాన్, ఇరాక్లతో అమెరికాకు సంబంధాలు కొంతమేర చెడిపోయే ప్రమాదముంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య వివాదాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. తాజాగా ఉదంతంతో ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది హైటెన్షన్గా మారింది.
కొన్ని రోజుల కింద జరిగిన యూఎస్ ఎయిర్ స్ట్రయిక్స్లో బాగ్దాద్కి చెందిన 25 మంది చనిపోయారు. ఆ దాడి తర్వాత ఖాసీం నేతృత్వంలో ఆందోళనకారులు బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై దాడి చేశారు. కార్యాలయాన్ని పగులగొట్టి, రిసెప్షన్ ప్రాంతాన్నితగలబెట్టారు. ఈ దాడిని అమెరికా మరింత సీరియస్గా తీసుకుంది. ఆ నేపథ్యంలోనే బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర రాకెట్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
For More News..