ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి : మంత్రి కొండా సురేఖ

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి : మంత్రి కొండా సురేఖ

 హైదరాబాద్, వెలుగు: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. అవగాహన లేకుండా విపరీతంగా ప్లాస్టిక్ వాడుతుండటంతో గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్నారు. సెక్రటేరియెట్​లోని తన కార్యాలయంతో పాటు, ఇంట్లోనూ వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.