ఏటా యూజర్ చార్జీల వసూలుకు సర్కార్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్ల నుంచి ఏటా రూ.2 వేల చొప్పున యూజర్ చార్జీలు వసూలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా స్కూల్ రికగ్నైజేషన్, రెన్యువల్ కోసం అప్లై చేసుకున్న వారి నుంచి యూజర్ చార్జీలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి జనార్దన్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏటా వెబ్ సైట్ను యూజ్ చేసినందుకు రూ. 2 వేలు చార్జీగా వసూలు చేయాలని స్కూల్ఎడ్యుకేషన్ కమిషనర్విజయ్కుమార్ నిర్ణయం తీసుకున్నారు. యూజర్ చార్జీల ద్వారా స్కూల్ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు ఏటా సుమారు రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూ రుతుందని పేర్కొంటున్నారు.