
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళిత, గిరజనులను భూముల విషయంలో మోసం చేశారు. మూడెకరాల భూ పంపిణీ చేయకపోగా.. పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. మెదక్ లో సర్వోదయ సంకల్ప్ యాత్రలో ఉత్తమ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, పేదల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు ఉత్తమ్.