తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్

తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్

మునుగోడు ఎన్నిక విషయంలో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాయల్టీ వాళ్ళకే మునుగోడు టికెట్ దక్కిందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్.. శత్రువులను ఎదుర్కోవాలంటే మనం సమిష్టిగా పనిచేయాల్సిందే అన్నారు. మునుగోడుకు ప్రతి ఒక్కరు వచ్చి పని చేయాలని తెలిపారు. మునుగోడు కోసం నేతలు ఎవరి ఖర్చు వల్లే భరించాలని సూచించారు. తోచిన కాడికి నేతలు పార్టీకి ఆర్ధికంగా సహకరించాలన్నారు. 

సెప్టెంబర్ 17తో టీఆర్ఎస్, బీజేపీలకు సంబంధం లేదని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తాన్ని ఏకతాటి మీదకు తీసుకురావడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో యాత్ర కు బ్రేక్ ఉంటదని ఉత్తమ్ తెలిపారు.