డ్రగ్స్ కేసులో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి?

డ్రగ్స్ కేసులో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై  చర్యలేవి?

అక్రమాలకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. డ్రగ్స్ కేసులో ఉన్న TRS ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్  చేయాలన్నారు. అలాగే.. ఓ వెంచర్ ఓనర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఉత్తమ్. మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.