- లబ్ధిదారులకు తాళాలు అందజేసిన సీఎం యోగి
న్యూఢిల్లీ: దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 76 ఫ్లాట్లను నిర్మించింది. ఆ ఇండ్ల తాళాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం పేదలకు అందజేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఈ సింగిల్ బెడ్రూం ఇండ్లకు.. లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పేదల స్థలాలను వ్యాపారులు, మాఫియా డాన్లు లాక్కునేవారు.
అలా కబ్జాలకు, ఆక్రమణలకు గురైన జాగల్లోనే మేము ఇప్పుడు ఇండ్లు కట్టి మళ్లీ పేదలకు పంచుతున్నం. ఇదొక పెద్ద విజయం”అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 100కు పైగా క్రిమినల్ కేసులలో దోషులుగా జైల్లో ఉన్న అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా దుండగులు కాల్చి చంపేశారు.