హత్యాయత్నం చేస్తే 10వేలు, హత్య చేస్తే రూ.55వేలు, కిడ్నాప్ చేస్తే 5వేలు, బెదిరించాలంటే రూ.1000ఉంటే సరిపోతుందంటూ సోషల్ మీడియాలో అడ్వటైజ్మెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఏదైనా బిజినెస్ జరగాలంటే పబ్లిసిటీ బాగుండాలి. అలా పబ్లిసిటీ బాగుంటేనే వ్యాపారం బాగా జరుగుతుంది. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలాకష్టం. అందుకే వ్యాపారస్థులు, కార్పొరేట్ కంపెనీలు తమ సంస్థ ఉత్పత్తుల అమ్మకాల కోసం ఆఫ్ లైన్, ఆన్ లైన్ మార్కెటింగ్ చేస్తాయి.
తాజాగా రౌడీలు సైతం మేం ఈ పనిచేస్తే ఇంత వసూలు చేస్తామంటూ కొటేషన్లతో సహా సోషల్ మీడియాలో పోస్టర్ డిజైన్ చేసి యాడ్ పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లోని ఓ రౌడీ బ్యాచ్…తాము చేసే పనిలో ఎంత క్లారిటీగా ఉంటామో వివరిస్తూ యువకుడు గన్ పట్టుకొని ఉన్న ఫోటోల్ని ఫోటోషాప్ లో హత్యాయత్నం చేస్తే 10వేలు, హత్య చేస్తే రూ.55వేలు, కిడ్నాప్ చేస్తే 5వేలు, బెదిరించాలంటే రూ.1000ఉంటే సరిపోతుందంటూ సోషల్ మీడియాలో యాడ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో సదరు రౌడీ గ్యాంగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.